మొబైల్‌కు వచ్చే ఆ లింక్‌లతో జాగ్రత్త.. ఏపీ ప్రజలు బీ కేర్‌ఫుల్

కరోనా సమాచారం పేరుతో సెల్‌ఫోన్లకు వచ్చే లింక్‌లను క్లిక్‌ చేయొద్దని సైబర్‌ నేరాల సెల్ ఎస్పీ రాధిక సూచిస్తున్నారు. క్రెడిట్‌ కార్డు నంబర్లు, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కొట్టేసేందుకు సైబర్‌ కేటుగాళ్లు ఈ లింక్‌లు పంపిస్తున్నారంటున్నారు.


ఏపీ ప్రజల్ని సీఐడీ అప్రమత్తం చేసింది. కరోనా సమాచారం పేరుతో సెల్‌ఫోన్లకు వచ్చే లింక్‌లను క్లిక్‌ చేయొద్దని సైబర్‌ నేరాల సెల్ ఎస్పీ రాధిక సూచిస్తున్నారు. క్రెడిట్‌ కార్డు నంబర్లు, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కొట్టేసేందుకు సైబర్‌ కేటుగాళ్లు ఈ లింక్‌లు పంపిస్తున్నారంటున్నారు. అందరూ ఇలాంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఒకవేళ లింకులు వస్తే.. వాటిని క్లిక్ చేయొద్దంటున్నారు.


కరోనా సమాచారం పేరుతో సైబర్‌ దాడులు జరిగే అవకాశముందని సీబీఐ.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిందట. సైబర్‌ నేరస్థులు ‘సెర్బెరస్‌’ అనే బ్యాంకింగ్‌ ట్రోజాన్‌ను మొబైల్స్‌కు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారట. ఆ లింక్‌లను ఫోన్‌లలో ఉంచితే క్రెడిట్‌, డెబిట్‌కార్డుల డేటాను చోరీ చేసి డబ్బులు కొట్టేస్తారని హెచ్చరిస్తున్నారు.

గత నెలలో ఫేక్ కాల్స్‌తో అమాయకుల్ని బురిడీ కొట్టించారు. కొద్దిరోజులుగా కొంతమంది తమ సమస్యల్ని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ పోలీసులు ప్రజల్ని అలర్ట్ చేశారు. ఫేక్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లాటరీలు, ప్రైజ్‌లు గెలచుకున్నారంటూ వచ్చే ఫోన్ కాల్స్ నమ్మొద్దని పోలీసులు సూచించారు. పొరపాటున కూడా బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వొద్దని అలర్ట్ చేశారు. అలాగే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయమని చెబుతారని.. అలాంటి కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.